జాతీయ వార్తలు
ఎఫ్ఐఆర్ దాఖలు చేయండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 January 2019
న్యూఢిల్లీ, జనవరి 22: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈవీఎంల రిగ్గింగ్ ఆరోపణలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా స్పందించింది. 2014 లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ సైబర్ ఎక్స్పర్ట్గా పేర్కొంటున్న సయ్యద్ షుజా లండన్లో చేసిన ఆరోపణలకు సంబంధించి ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పుడు కథనాలు, వదంతులను వ్యాపింపజేయడం ద్వారా ప్రజల్లో సందేహాలు, అనుమానాలకు కారణమైన షుజాపై ఐపీసీ 505 (1) సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని కోరింది. అలాగే అతడు చేసిన ఆరోపణలకు సంబంధించి పూర్తిస్థాయిలో తక్షణ ప్రాతిపదికన దర్యాప్తు చేయాలని కూడా పోలీసులకు స్పష్టం చేసింది.