జాతీయ వార్తలు

సాకులు వెతుక్కుంటున్న విపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జనవరి 22: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమకు పరాజయం తప్పదని నిర్ధారించుకున్న విపక్షాలు దాని నుంచి తప్పించుకోవడానికి సాకులు వెతుక్కుంటూ ఈవీఎంలపై విమర్శలు ప్రారంభించాయని కేంద్ర మంత్రి జవడేకర్ విమర్శించారు. మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అందుకే విపక్షాల కూటమి పార్టీలు ఒక కమిటీగా ఏర్పడి ఈవీఎంల పాట పాడుతున్నాయని అన్నారు. బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2014లో జరిగిన ఎన్నికల కన్నా తమకు ఈసారి ఎక్కువగా సీట్లు వస్తాయని ఆయన చెప్పారు. కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న విపక్షాలు మేనిఫెస్టోను తయారు చేయడానికి, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ కోసం కమిటీలను ఏర్పాటు చేయడంలో విఫలమైనా, ఈవీఎంల మీద మాత్రం కమిటీని వేశాయని ఆయన విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదని నిర్ణయానికి వచ్చిన విపక్షాలు ఓటమిని తప్పించుకోవడానికి సాకుగా ఈవీఎంలను ఎన్నుకున్నాయని అన్నారు. విపక్షాల కూటమికి నాయకుడు కాని, విజన్ కాని లేవని కాని తమ ప్రభుత్వం కుల, మత, ఉగ్రవాదం, నిరుద్యోగం లేని సమాజాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్డీఏ అభివృద్ధిలో దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు. అందుకే గత ఎన్నికల కన్నా ఈసారి తమకు మరిన్ని సీట్లు వస్తాయన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని 25 సీట్లను గెల్చుకోవాలని తమ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆయన చెప్పారు. సోమవారం జరిగిన పార్టీ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే గైర్హాజరిపై ఆయన మాట్లాడుతూ ఆమె తన జల్వర్‌లో వ్యక్తిగత పర్యటన వల్ల సమావేశానికి రాలేకపోయారని వివరించారు.