జాతీయ వార్తలు

అరవిరిసిన పద్మాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని రాష్టప్రతి భవన్‌లో సోమవారం పద్మాలు అరవిరిశాయ. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పురస్కారాలు అందచేశారు. ఐదుగురు పద్మ విభూషణ్, ఎనిమిది మంది పద్మ భూషణ్,
43 మంది పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. సోమవారం పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్న వారిలో భారత సంతతికి చెందిన అమెరికా దేశస్థుడు, ఆర్థికవేత్త అవినాష్ కమలాకర్ దీక్షిత్, జమ్మూకాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్‌మోహన్, భారతీయ నాట్యరంగం అభివృద్ధికి విశేష కృషి చేసిన యామినీ కృష్ణమూర్తి,
శ్రీశ్రీ రవిశంకర్ ఉన్నారు. ఆంధ్ర నుంచి ప్రముఖ శాస్తవ్రేత్త ఎ.వి. రామారావు పద్మభూషణ్ అవార్డు అందుకుంటే, ప్రముఖ హృద్రోగ నిపుణుడు
ఎ గోపాలకృష్ణ గోఖలే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.

చిత్రం రాష్టప్రతి నుంచి పద్మభూషణ్ అవార్డు అందుకుంటున్న ప్రముఖ శాస్తవ్రేత్త ఎ.వి. రామారావు