జాతీయ వార్తలు

ఏపీ భవన్‌లో రాహుల్ ‘్భజన్ పే చర్చ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో రూపకల్పనలో భాగంగా ‘అప్నే బాత్-రాహుల్ కే సాత్’ పేరిట ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఏడుగురు చిన్నతరహా పారిశ్రామికవేత్తలతో దేశ రాజధానిలోని ఏపీ భవన్‌లో ‘్భజన్ పే చర్చ’ కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రా భోజనం చేస్తూ పారిశ్రామికవేత్తల నుంచి రంగాల వారీగా ఉన్న సమస్యలు, పరిష్కారాలు, సలహాలు, అభిప్రాయాలను రాహుల్ తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ యంత్రాంగం వీడియోలో చిత్రీకరించారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ తరపున తీసుకోవాల్సిన విధానాలు, మ్యానిఫెస్టోలో రూపొందించాల్సిన అంశాలపై రంగాలవారీగా ప్రజలు, వివిధ సంస్థల ద్వారా అభిప్రాయలను రాహుల్ తెలుసుకుంటున్నారు.