జాతీయ వార్తలు

మోదీవి పొంతన లేని మాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, మార్చి 12: ప్రధానమంత్రి కాన్వాయ్ వల్ల సాధారణ ప్రజలు రోడ్లపైన తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారంటూ వీఐపీ సంస్కృతి విడనాడాలని బీజేపీ అసమ్మతి ఎంపీ శత్రుఘ్న సిన్హా విమర్శించారు. బీజేపీకి త్వరలో సిన్హా గుడ్‌బై చెప్పనున్నారని వదంతులు వెలువడుతన్న తరుణంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రధానమంత్రి పేరు ప్రస్తావించకుండా, ఉన్నత స్థానంలో ఉన్న వారు మాటలకు చేతలకు మధ్య తేడా లేకుండా ఆచరణలో చూపించాలని ట్వీట్ చేశారు. వీఐపీల కాన్వాయ్ వల్ల రోడ్డు మీద వెళ్లే ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక ఎంపీ ప్రధానమంత్రి అవుతారని, ఎందుకీ ఇంత హంగామా అని ప్రశ్నించారు. సామాన్యులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా వీఐపీలు నడుచుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో సిన్హా ప్రతిపక్ష పార్టీల కూటమి తరఫున పాట్నా సీటు నుంచి పోటీ చేసే అవకాశం కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా సిన్హా అభ్యర్థిత్వంకు మద్దతు తెలియచేసేందుకు వెనకాడడం లేదు. ఆ పార్టీ కూడా ఇప్పటికే సిన్హా అభ్యర్థిత్వాన్ని మొగ్గుచూపినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ లేదా ఆర్‌ఎల్‌డీ పార్టీలు తమ పార్టీ తరఫున సిన్హా పోటీ చేసే టిక్కెట్ ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాయి. పాట్నా లోక్‌సభ సీటు పరిధిలో క్షత్రియులు అధిక సంఖ్యలో ఉన్నారు. గెలుపు గ్యారంటీ అనే నమ్మకంతో కాంగ్రెస్, ఆర్‌ఎల్‌డీ ఉన్నాయి.