జాతీయ వార్తలు

ఫతేపూర్ సిక్రీ నుంచి రాజ్‌బబ్బర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మార్చి 23: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఫతేపూర్ సిక్రీ లోక్‌సభ సీటునుంచి పోటీ చేస్తారు. నసీముద్దీన్ సిద్దిఖీ బిజ్నూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. సిద్దిఖీ గతంలో బీఎస్పీలో ఉండేవారు. 2018లో బీఎస్పీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. బరేలీ సీటు నుంచి ప్రవీణ్ ఆరాన్ పోటీ చేస్తారు. 2009 ఎన్నికల్లో ఈ సీటు నుంచి ప్రవీణ్ పోటీ చేసి గెలిచారు. మొరాదాబాద్ సీటును ఇమ్రాన్ ప్రతాప్‌ఘారియాకు కేటాయించారు. రాజ్‌బబ్బర్ 1999, 2004 ఎన్నికల్లో ఆగ్రా నుంచి రెండుసార్లు పోటీ చేసి నెగ్గిన విషయం విదితమే. వచ్చే ఎన్నికల్లో మొదట రాజబబ్బర్‌కు మొరాదాబాద్‌ను కేటాయించి ఆ తర్వాత మార్చి ఫతేపూర్ సిక్రీకి మార్చారు. రాజ్‌బబ్బర్‌లో 2009 ఉప ఎన్నికల్లో ఫిరోజాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. హాతారస్ సీటను త్రిలోకిరామ్ దివాకర్‌కు, ప్రీతా హరిత్‌కు ఆగ్రా సీటును, వీరేంద్రకుమార్ వర్మకు హరోదడీ సీటును, గిరీఊష్ చంద్రపైసీకి కౌశంబి సీటు నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ టిక్కెట్లు ఇస్తున్నట్లు ప్రకటించింది.