జాతీయ వార్తలు

మీ పోరాటాలు వృథా కావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 23: స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన వీరులు భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు యువతకు ఆదర్శమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. శనివారం ఇక్కడ ఈ ముగ్గురు వీరుల వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, భగత్ సింగ్ ఆలోచనలు, ఆశయాల సాధనకు అంకితభావంతో పనిచేస్తామన్నారు. ఈ ముగ్గురు గొప్ప నేతలని, వారి పోరాటాలతో భారతావనిని ఉత్తేజపరిచారన్నారు. వీరి జీవితాలు మనందరికీ ఆదర్శప్రాయమని ఆయన ట్వీట్ చేశారు. వీరి రాజీలేని పోరాటం, నిస్వార్థ జీవితం, ఆత్మత్యాగం వల్ల ఈరోజు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నామన్నారు. వీరి సాహసాలకు ప్రతి ఒక్కరు సలాం చేయాలన్నారు.