రాష్ట్రీయం

మోదీ ఓ నియంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: ప్రజాస్వామ్యంలో ప్రధాని మోదీ ఒక నియంత అని తెలుగు దేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ వ్యాఖ్యానించారు. అలాంటి వారు ఎక్కువకాలం రాజ్యాధికారంలో ఉండలేరని బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు సరిగ్గా లేదని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీ వ్యతిరేక శక్తులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకతాటిపైకి తెస్తున్నారని టీజీ వెల్లడించారు. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని టీజీ జోస్యం చెప్పారు.