జాతీయ వార్తలు

పెళ్లికొడుకు తండ్రి పెళ్లికూతురు తల్లి పరార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరత్, జనవరి 22: అట్టహాసంగా జరగాల్సిన పెళ్లి అర్థంతరంగా ఆగిపోయింది. పెళ్లికుమారుడి తండ్రి, పెళ్లి కుమార్తె తల్లి జంటగా పరారీ కావడంతో పెళ్లికి హాజరైనవారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. హిమ్మత్ పటేల్ (43) సూరత్‌లోని కటార్‌గామ్ ప్రాంతానికి చెందినవాడు కాగా, శోభనా రావల్ (42) నౌసరి జిల్లాలోని వెజల్పూర్ నివాసి. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు. కలిసే పెరిగారు. వివాహం తర్వాత శోభన నౌసరీకి వెళ్లిపోయింది. ఇటీవల బంధువులంతా కలిసి హిమ్మత్ పటేల్ కొడుకుతో శోభన కుమార్తె వివాహం చేయాలని నిర్ణయించారు. దీనికి వీరిద్దరు కూడా అంగీకరించారు. అయితే, పెళ్లికి ముందే, ఈనెల 10వ తేదీన వారిద్దరూ కనిపించకుండా పోయారు. పెళ్లి ఏర్పాట్లలో ఉన్న బంధువులంతా వీరు ఇతరత్రా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారని భావించారు. అయితే, ఎంతకూ వీరిద్దరి జాడ తెలియకపోవడంతో వారంతా పోలీసులను ఆశ్రయించారు. దీనిపై శోభన అత్త స్పందిస్తూ అందరి కుటుంబాలు సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.
పిల్లలకు పెళ్లి చేయాల్సిన పరిస్థితుల్లో పెద్దలుగా ఉన్న వారిద్దరూ పరారీ కావడాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. మొత్తమీద బంధువుల సమక్షంలో ఆర్భాటంగా జరగాల్సిన పెళ్లి ఎవరూ ఊహించని పరిస్థితుల్లో హఠాత్తుగా నిలిచిపోయింది.