జాతీయ వార్తలు

28 మంది సీబీఐ అధికారులకు రాష్ట్రపతి పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: విధి నిర్వహణలో అత్యత్తమ ప్రతిభ కనబరిచిన 28 సీబీఐ అధికారులు రాష్ట్రపతి పోలీసు అవార్డులకు ఎంపికయ్యారు. వీరిలో మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు ఆయన ఇంటి గోడ ఎక్కిన డిప్యూటీ ఎస్‌పీ రామస్వామి పార్థసారధి కూడా ఉన్నారు. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో పి. చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రధాన గేటు మూసి ఉండడం, సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించకపోవడంతో డిప్యూటీ ఎస్‌పీ రామస్వామి ధైర్యసాహసాలతో చిదంబరం నివాసం గోడ ఎక్కి ఇంట్లోకి ప్రవేశించడం జరిగింది. చిదంబరం తనయుడు కీర్తిని కూడా డిప్యూటీ ఎస్‌పీ రామస్వామి అరెస్టు చేశారు. ఆయన చూపిన చొరవ కారణంగా రాష్ట్రపతి మెడల్ ఇవ్వవచ్చని ఉన్నతాధికారులు సిఫార్సు చేయడం జరిగింది. ఈ మేరకు 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రామస్వామి ఈ అత్యున్నతమైన పురస్కారం అందుకోనున్నారు.