జాతీయ వార్తలు

సీసీ కెమెరాలతో నేరాలు తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటి నుంచి నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టాయని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం తెలియజేశారు. ‘డాటర్స్ ఆఫ్ ఢిల్లీ’ కార్యక్రమంలో భాగంగా వీడియో మెసేజ్‌లో సీఎం మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అనేక కార్యక్రమాలను ఆప్ ప్రభుత్వం చేపట్టిందని సీఎం వివరించారు. ఢిల్లీలో రెండు లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం వీటిని ఏర్పాటు చేశామనీ.. బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా.. మార్షల్స్‌ను కూడా ఉండేలా చర్యలు తీసుకొన్నామని ఆయన వివరించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాక నేరాలు తగ్గుముఖం పట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ‘మహిళల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకొంటున్నాం.. ఎందుకంటే మీరు గతంలో నాకు ఓటు వేసి గెలిపించారు.. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. అందువల్ల ఆప్‌కు మద్దతు ఇవ్వాలని కోరుకొంటున్నాను’ అని మహిళలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.