జాతీయ వార్తలు

మార్చి 28 నుంచి రామాయణ ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాముడికి సంబంధించిన వివిధ ప్రాంతాలను సందర్శించాలనుకున్న భక్తజనకోటి కోసం ‘శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్’ను వచ్చే నెల 28వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్టు ఐఆర్‌సీటీసీ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైలులో 10 బోగీలు ఉంటాయని, వాటిలో 5 ఏసీ రహిత స్లీపర్ క్లాస్ బోగీలని తెలిపింది. మిగతా 5 త్రై టైర్ ఏసీ బోగీలని తెలిపింది. మొదట వచ్చిన వారికి మొదటి అవకాశం అనే విధానంలో టికెట్ల బుకింగ్ ఉంటుందని ఐఆర్‌సీటీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సర్వీసుకు విశేష స్పందన ఉందని, అమ్మకానికి ఉంచిన టికెట్లన్నీ వారం రోజుల్లోనే అమ్ముడయ్యాయని వివరించింది. టికెట్ కొన్నవారు ఢిల్లీ సఫ్దర్‌గంజ్, ఘజియాబాద్, మొరాదాబాద్, బరేలీ, లక్నోలో ఏదో ఒక ప్రాంతంలో ట్రైను ఎక్కవచ్చునని తెలిపింది. 16 రాత్రులతో కూడిన 17 రోజుల టూర్‌లో రాముడికి సంబంధించిన అన్ని ప్రాంతాలను ‘రామాయణ సర్క్యూట్ ఆఫ్ ఇండియా’ పేరుతో సందర్శించే అవకాశం ఉంటుందని తెలిపింది. అయోధ్యలోని రామ జన్మభూమి, హనుమాన్ గార్హీ, సీతామార్తీ (బిహార్)లోని సీతామాత మందిరం, నందిగ్రామ్‌లోని భారత్ మందిర్, నేపాల్‌లోని జనక్‌పూర్, వారణాసిలోని తులసీ మానస్ మందిర్, సంకట్ మోచన్ మందిర్, ఉత్తరప్రదేశ్ సీతామార్తీలోని సీత సమాహిత్ స్థల్, ప్రయాగ్‌లోని త్రివేణి సంగం, హనుమాన్ మందిర్, భరద్వాజ్ ఆశ్రమం, శృంగ్వేర్‌పూర్‌లోని శృంగీ రుషి మందిర్, చిత్రకూట్‌లోని రాంఘాట్, సతీఅనసూయ మందిర్, నాసిక్‌లోని పంచవటి, హంపీలోని అంజనాద్రి, హనుమాన్ జన్మస్థల్, రామేశ్వరంలోని జ్యోతిర్లింగ శివ మందిర్ వంటి ప్రధాన ప్రాంతాలను టూరిస్టులు సందర్శించుకోచ్చు. ఈ రైలులో పూర్తిస్థాయి శాఖాహార భోజనాన్ని మాత్రమే ఇస్తారు. స్లీపర్ క్లాస్ బుకింగ్ చేసుకున్నవారికి ధర్మశాలల్లోను, ఏసీ టికెట్ ఉన్నవారికి హోటళ్లలోనూ బసను ఏర్పాటు చేస్తారు. సైట్ సీయింగ్‌కు అన్నిరకాల టికెట్లు ఉన్నవారికి నాన్ ఏసీ బస్సుల్లో తీసుకెళ్తారు. ఈ ప్యాకేజీ నాన్ ఏసీ వారికి 16,065 రూపాయలు, ఏసీ వారికి 26,775 రూపాయలుగా ఖరారు చేశారు. ఒకవేళ రామాయణంతో సంబంధం ఉన్న శ్రీలంకకు వెళ్లాలనుకుంటే అదనపు మొత్తాన్ని చెల్లించి ప్యాకేజీలను తీసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్ 11న రామాయణ ఎక్స్‌ప్రెస్ చేరుకుంటుంది. ఆ వెంటనే శ్రీలంకకు మొదలవుతుంది. మూడు రాత్రులు శ్రీలంకలో నివాసం ఉండేందుకు వీలుగా రూపొందించిన ఈ ప్యాకేజీలో క్యాండీ, నువారా ఎలియా, నెగోంబోలో బస చేయవచ్చు. మనిషికి 37,800 రూపాయలు వసూలు చేసే ఈ టూర్‌లో సీతామాత మందిర్, అశోక్ వాటిక, విభూషణ్ టెంపుల్‌తోపాటు మునే్నశ్వరంలోని ప్రఖ్యాత శివాలయం వంటి ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి.