జాతీయ వార్తలు
‘పార్క్’ కాదు.. ‘ఉద్యాన్’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 13 March 2020
ముంబయి, మార్చి 12: శివాజీ పార్కు పేరును ఛత్రపతి శివాజీ పార్కుగా మార్చడం పట్ల ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ రాం నాయక్ హర్షం వ్యక్తం చేశారు. అయితే, ఈ పేరులో పార్క్ అనే ఆంగ్ల పదం ఉందని ఆయన గుర్తు చేశారు. దాని స్థానంలోనే మరాఠీ భాషలో ఉపయోగించే ఉద్యాన్ పదాన్ని చేర్చాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. దివంగత నేత వీరసావర్కర్ కూడా ఈ మార్పును హర్షిస్తారని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. బృహన్ముంబయ్ మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల శివాజీ పార్కు పేరును ఛత్రపతి శివాజీ మహరాజ్ పార్కుగా మార్చింది. అయితే, ఇందులో పార్కు పదం స్థానంలోనే ఉద్యాన్ పదం జోడించి మరోసారి ప్రకటన విడుదల చేయాలని రాంనాయక్ కోరారు.