జాతీయ వార్తలు
జిల్లా కాంగ్రెస్కు కొత్త బాస్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు, నగరాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ పేరు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా క్యామా మల్లేశం, రామగుండం డీసీసీ అధ్యక్షుడిగా లింగస్వామి, నిజామాబాద్ డీసీసీ చీఫ్గా తాహెర్ బిన్ హమ్దానీ నియమితులయ్యారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగా కటకం మృత్యుంజయ, ఆదిలాబాద్ డీసీసీకి అల్లేటి మహేశ్వర్ రెడ్డి, మెదక్ డీసీసీకి సునీతా లక్ష్మారెడ్డి, మహబూబ్నగర్ డీసీసీకి ఓబేదుల్లా కొత్వాల్, నల్లగొండ డీసీసీకి బుద్దా బిక్షమయ్యగౌడ్ల పేర్లు ప్రకటించారు. వరంగల్ డీసీసీ చీఫ్గా నైని రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ పట్టణానికి కేశ వేణు, కరీంనగర్ పట్టణానికి కర్రా రాజేశ్వర్, వరంగల్ పట్టణానికి కేదారి శ్రీనివాస్ రావును ఎంపిక చేసినట్టు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.