జాతీయ వార్తలు

పరిశీలించమన్నారు.. అదే చేస్తున్నాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీకి ప్రత్యేక రైల్వేజోన్ అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు అంశం పరిశీలనలో ఉందని మాత్రమే కేంద్రరైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. ఏన్డీయే ప్రభుత్వం గత నాలుగేళ్లలో రైల్వేశాఖ చేపట్టిన సంక్షేమ కార్యకలపాలు, అభివృద్ధికి సంబంధించిన విషయాలను ఆయన విలేఖరులకు వివరించారు. విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు అంశంపై ఆయనను ప్రశ్నించగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రైల్వేజోన్ అంశాన్ని పరిశీలించాలని మాత్రమే ఉందని, రైల్వేజోన్ అంశం ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఇదే విషయాన్ని గత పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడించామని ఆయన గుర్తు చేశారు.
సాయంపై ఏపీకి వెళ్లి వివరిస్తా
ఆంధ్రప్రదేశ్‌కు మానవ వనరుల శాఖ ద్వారా అందించిన సహాయంపై విజయవాడలో మీడియా సమవేశం ఏర్పాటు చేసి వివరిస్తానని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. ఏన్డీయే నాలుగేళ్ల పాలనపై మానవ వనరుల శాఖ చేపట్టిన సంక్షేమ కార్యకలపాలపై సోమవారం విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏపీకి సంబంధించిన అంశాలపై ఈ సమాధానం ఇచ్చారు.