రాష్ట్రీయం

మనీష్ సిసోడియాకు వైద్య పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 18: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నివాసంలో నిరాహారదీక్ష చేస్తున్న ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం ఆసుపత్రికి తరలించారు. ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో వైద్యపరీక్షలు అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా, ‘మనీష్ సిసోడియాను ఆసుపత్రికి తరలించారు’ అంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారుల సమ్మె విరమించాలంటూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, గోపాల్‌రాయ్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో నిరాహారదీక్ష చేస్తున్న విషయం విదితమే. ఆదివారం రాత్రి ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఆసుపత్రికి తరలించగా, సోమవారం సిసోడియాను ఆసుపత్రికి తరలించారు.