రాష్ట్రీయం

టీడీపీ మరో కొత్త నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: పార్లమెంట్ సాక్షిగా తెలుగుదేశం పార్టీ కొత్త నాటకాలకు తెరలేపిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. మంగళవారం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం చేసిన పాపాల చిట్టా తమవద్ద ఉందని ఆ పార్టీని హెచ్చరించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఏదో చేసేస్తాం అంటూ తెలుగుదేశం ఎంపీలు విర్రవీగుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అంటే టోటల్ డ్రామా పార్టీ అంటూ ఆయన అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు, నాయకులు డ్రామాలాడుతున్నారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ దొంగదీక్షలు చేశారని, మరోవైపు ప్రత్యేక ప్యాకేజీకి నిధులివ్వాలని ఉత్తరాలు రాస్తున్నారని ఆరోపించారు. పాతిక ఎంపీ సీట్లకోసం ఎన్ని అబద్ధాలైనా,డ్రామాలకైనా టీడీపీ సిద్ధంగా ఉంటుందని విమర్శించారు. విభజన హామీలపై చర్చ జరిగితే పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలకు ఎత్తిచూపుతామని జీవీఎల్ స్పష్టం చేశారు. ఏపీలో 1500 రోజుల పాలనలో టీడీపీ ప్రభుత్వం ఏదో సాధించామన్నట్టు గొప్పలు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు.