జాతీయ వార్తలు

అనాథనైపోయా: శత్రుఘ్నసిన్హా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, ఆగస్టు 17: వాజపేయి మరణం వార్త తెలిసిన వెంటనే తాను అనాథనైనట్టు భావిస్తున్నానని, బాలీవుడ్ నటుడు, పాట్నా బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా పేర్కొన్నారు. వాజపేయి ఆధ్వర్యంలో తాను రాజకీయ కళను అభ్యసించానని చెప్పారు. వాజపేయి ప్రభుత్వ హయాం లో కేంద్ర మంత్రిగా 1999-2004 మధ్య పనిచేసిన ఆయన వాజపేయిని స్మృతించుకుంటూ ‘మేము నిత్యం మిమ్మల్ని స్మరించుకుంటాం, మీ మార్గదర్శకాన్ని మేము కోల్పోయాం’ అని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో నానాజీ దేశ్‌ముఖ్ తనను రాజకీయ శిక్ష నిమిత్తం వాజపేయి, అద్వానీ వద్దకు పంపించారని గుర్తు చేసుకున్నా రు. వారిద్దరి ఆశీలస్సులతో రాజకీయాల గురించి ఓనమాలు నేర్చుకున్నానన్నారు. అంతేకాకుండా 1999లో చేపట్టిన చారిత్రాత్మకమైన లాహోర్ బస్సు యాత్రలో తనను భాగస్వామిని చేయడం మరచిపోలేనిదన్నారు. 2004లో లక్నోలో జరిగిన ఎన్నికల సభలో అటల్‌జీ తనను ప్రత్యేకంగా ఆహ్వానిం చి ప్రసంగించమని కోరారని, ఆ క్షణాలు తనకు తీవ్ర ఉద్విగ్నపరిచాయని గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు యావత్ రాజకీయ వర్గాలకు తీర్చలేనిదని శత్రుఘ్న సిన్హా పేర్కొన్నారు.