బిజినెస్

పోస్టు బ్యాంకు సేవలు షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: దేశవ్యాప్తంగా తపాలా బ్యాంకింగ్ సేవలు ప్రారంభమయ్యాయి. భారత పోస్టు బ్యాంకు సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఇక్కడ ప్రారంభించారు. తపాలా బ్యాంకింగ్ సేవలు దేశంలోని దాదాపు అన్ని శాఖల్లో గల మూడు లక్షల మంది పోస్టుమ్యాన్‌లు, గ్రామీణ డాక్ సేవక్‌ల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండడనున్నాయి. ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)గా పరిగణించే ఈ పోస్టల్ బ్యాంకింగ్ సేవలు ఇపుడున్న ఇతర బ్యాంకింగ్ సేవలకేమీ తీసిపోవు. బ్యాంకుల తరహాలోనే ప్రజల నుండి డిపాజిట్లను ఆహ్వానిస్తారు. అయితే, రుణాలు ఇవ్వడం, క్రెడిట్ కార్డులను అందించడం వంటి జోలికి వెళ్లడం లేదు. ఖాతాదారుల నుంచి లక్ష రూపాయల వరకు డిపాజిట్‌లను సేకరిస్తారు. ఆ తర్వాత మొబైల్ ద్వారా నగదు చెల్లింపులు, నగదు బదిలీ, కొనుగోళ్లు, ఏటీఎం/డెబిట్ కార్డుల సర్వీసులు, నెట్ బ్యాంకింగ్, థర్డ్ పార్టీ ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి సౌకర్యాలు పోస్టల్ బ్యాంకింగ్ ద్వారా పొందవచ్చునని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. పోస్టల్ బ్యాంక్ సేవలు దేశవ్తాప్యంగా గల 650 పోస్టల్ శాఖలు, 3,250 పాయింట్ల ద్వారా పొందవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఏ అకౌంట్‌లోనైనా డిపాజిట్ చేసిన సొమ్ము లక్ష రూపాయలు దాటితే అది ఆటోమేటిక్‌గా పోస్టల్ సేవింగ్స్ ఖాతాలోకి బదిలీ అవుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం కూడా పోస్టల్ బ్యాంక్‌లకు రక్షణ కవచంలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పోస్టల్ బ్యాంక్‌ల ద్వారా వివిధ ఉత్పత్తులు, సర్వీసులు అందించడంతోపాటు, మైక్రో ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్ యాప్, మెసేజ్‌లు, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ వంటి సేవలను కూడా అందించనున్నామని ఆయన పేర్కొన్నారు. పోస్టల్ బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతాదారులకు నాలుగు శాతం వడ్డీ ఉంటుందని ఆయన తెలిపారు. రుణాలు, ఇన్సూరెన్స్ వంటి థర్డ్ పార్టీ ఉత్పత్తుల కోసం ఆర్థిక సంస్థలైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బజాజ్ అలియంజ్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో జతకట్టామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో పేమెంట్ సేవలు అందిస్తున్న ఎయిర్‌టెల్, పేటీఎం పేమెంట్ బ్యాంకుల నుంచి పోటీని తట్టుకునేందుకు వీలుగా ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ)లో వౌలిక సదుపాయాల కోసం 1,435 కోట్ల రూపాయలు ఖర్చు చేసే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గత వారం అంగీకరించిందని ఆయన తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా 1.55 లక్షల పోస్టల్ బ్యాంకులు, అనుబంధ పాయింట్ల ఏర్పాటు జరుగుతుందని, ఇందులో 1.30 లక్షల పాయింట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటవుతాయని ఆయన పేర్కొన్నారు.
భారత ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన పేమెంట్ బ్యాంకులో నూటికి నూరు శాతం షేర్లు కేంద్రప్రభుత్వానివే. పోస్ట్ఫాసుల్లో మూడు లక్షల మంది పోస్ట్‌మ్యాన్‌లు, గ్రామీణ డాక్ సేవక్‌లు పనిచేస్తున్నారు. దేశంలో 1.55 లక్షల పోస్ట్ఫాసులను ఐపీపీబితో డిసెంబర్ 31వ తేదీలోపల అనుసంధానం చేస్తారు.
ఐపీపీబీ మూడు రకాల సేవింగ్స్ అకౌంట్స్‌ను ఆఫర్ చేస్తుంది. రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్, డిజిటల్ సేవింగ్ అకౌంట్, బేసిక్ సేవింగ్స్ అకౌంట్ సేవలను అందిస్తుంది. ఈ అకౌంట్లలో డిపాజిట్ చేసిన సొమ్ముపై సాలీనా నాలుగుశాతం వడ్డీ చెల్లిస్తారు. ఈ వెబ్‌సైట్ జఔఔఇ్యశజశళ.ష్యౄ. ఎస్‌ఎంఎస్ సదుపాయం ఉంటుంది. కస్టమర్లకు వేగంగా నగదు డిపాజిట్, బదలాయింపు, నగదు విత్‌డ్రా సమాచారం మొబైల్ ఫోన్ల ద్వారా తెలుస్తుంది. ఐపీపీబీ ఎస్‌ఎంఎస్ బ్యాంకింగ్ నంబర్ 7738062873. కస్టమర్ కేర్ నంబర్ 155299.