జాతీయ వార్తలు

నీరవ్ మోదీ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన 13వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని లండన్‌లో అరెస్టు చేశారు. లండన్ కోర్టులో హాజరుపరిచిన నీరవ్ మోదీని భారతదేశానికి అప్పగించే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాం బయటపడక ముందే అతను దేశం విడిచి పారిపోయాడు. లండన్ వీధుల్లో తిరుగుతుంటే అతను ఓ మీడియా కెమెరా కంటపడ్డాడు. వెస్ట్ మినిస్టర్ కోర్టు అతని అరెస్టుకు వారెంట్ జారీ చేసింది. నీరవ్ మోదీకి చెందిన 173 పెయింటింగ్స్, 11 లగ్జరీ కార్లను వేలం వేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కోర్టు అనుమతి కూడా తీసుకుంది.