జాతీయ వార్తలు

తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూన్ 3: తమిళనాడులో శుక్రవారం నాటి ఘరో రోడ్డు ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఒక బస్సు, లారీ, కారు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. కనీసం 30 మంది గాయపడ్డారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా మెలుంమలైలో ఈ దారుణం చోటుచేసుకుంది. బెరిగైన నుంచి 33 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వేరుశెనగ లోడుతో వస్తున్న లారీని బలంగా ఢీకొంది. ఆ సమయంలో అదే మార్గంలో వస్తున్న కారును ఢీకొంది. మృతుల్లో ఆరుగురు మహిళలు, 12 ఏళ్ల బాలుడు ఉన్నారు. ప్రాధమిక సమాచారం మేరకు అదుపుతప్పిన లారీ బస్సు, కారుపైకి దూసుకొచ్చింది. సంఘటనా స్థలంలో 16 మంది చనిపోగా, ఆసుమత్రికి తరలిస్తుండగా ఇద్దరు మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.