జాతీయ వార్తలు

బిఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై మిలిటెంట్ల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంత్‌నాగ్, జూన్ 3: జమ్మూకాశ్మీర్‌లోని బిజ్‌బెహారాలో శుక్రవారంనాడు ఆర్మీ కాన్వాయ్‌పై తీవ్రవాదులు తెగబడ్డారు.
ఈ దాడిలో ముగ్గురు బిఎస్‌ఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఏడుగురు జవాన్లు గాయపడ్డారు. అలాగే ముగ్గురు పౌరులకు గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. గొరిల్లా తరహాలాలో బిఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై మిలిటెంట్లు దాడి చేశారు. 1ఏ హైవేను ఆనుకుని ఉన్న పట్టణంలో జవాన్లు, మిలిటెంట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
గాయపడ్డ జవాన్లను శ్రీనగర్ ఆసుపత్రికి తరలించారు. మిలిటెంట్లు ప్రభుత్వ సబ్ డిస్ట్రిక్ ఆసుపత్రి భవనంలో దాక్కుని, అక్కడి నుంచి కాన్వాయ్‌పై కాల్పులు జరిపారని అధికారులు చెప్పారు. దాడి సంఘటన తరువాత ప్రాంతమంతా భయానకంగా మారిం ది. వెంటనే భద్రతాదళాలు పట్టణాన్ని తమ స్వాధీనంలోకి తీసుకుని జల్లెడపట్టారు. నిత్యం రద్దీగా ఉండే రహదారిపై రాకపోకలను నిలిపివేశారు.

బిజ్‌బెహారాలో మిలిటెంట్లు
దాడి చేసిన ప్రాంతంలో భద్రతా దళాల గస్తీ