జాతీయ వార్తలు

ప్రధాని మోదీ నన్ను చంపేస్తారేమో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: కేంద్ర ప్రభుత్వంతో నిత్యం ఘర్షణ పడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
తన ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుదలపై తీవ్ర అక్కసుతో ఉన్న మోదీ తనను చంపేస్తారేమోననిపిస్తోందని కేజ్రివాల్ బుధవారం ఓ వీడియో మెస్సేజిలో వ్యాఖ్యానించారు. ‘సామాన్యుడికి అరవింద్ కేజ్రివాల్ సందేశం’ అనే పేరుతో యు ట్యూబ్‌లో ఉంచిన పది నిమిషాల నిడివి కలిగిన ఆ వీడియోలో కేంద్ర ప్రభుత్వంతో ఆప్ ప్రభుత్వానికి ఉన్న వివాదాల జాబితాను ఏకరవు పెట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఆదాయం పన్ను శాఖ ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వార్ నివాసంలో బుధవారం సోదాలు నిర్వహించిన రోజే కేజ్రివాల్ ఈ వీడియోను ఉంచడం గమనార్హం. ఇటీవల అరెస్టు చేసిన ఓఖ్లా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, మెహ్రౌలి ఎమ్మెల్యే నరేశ్ యాదవ్‌లతో కలుపుకొని వివిధ ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన ఆప్ ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరుకుంది. ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా ఆప్ ఎదుగుదలను సహించలేక ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన కక్ష సాధింపుచర్యలే ఈ అరెస్టులని ఆ పార్టీ అంటోంది.