జాతీయ వార్తలు
నేపాల్లో చిక్కుకున్న యాత్రికులు సురక్షితం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 1 August 2016
న్యూఢిల్లీ, జూలై 31: నేపాల్లోని ముక్తినాథ్ వద్ద మంచుకొండలు విరిగిపడటంతో హైదరాబాద్కు చెందిన ఎనిమిది మంది మహిళా యాత్రికులు చిక్కుకున్నారు. దీనిపై స్పందించిన ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి, నేపాల్ ఎంబసి అధికారులతోను మాట్లాడారు. యాత్రికులను రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలు చేపట్టాలని కోరారు. యాత్రికులంతా సురక్షితంగా ముక్తినాథ్కు చేరుకున్నారని, హోటల్ మూన్లైట్లో బస చేస్తున్నారని రెసిడెంట్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ యాత్రికులను హెలికాప్టర్లో ఫోఖ్రాకు తరలించాలని, అనంతరం రైలులో వారణాసికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.