జాతీయ వార్తలు

స్పీకరే చెప్పాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టాన్ని సవరించాలంటూ కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు ప్రతిపాదించిన సవరణ బిల్లు ద్రవ్య బిల్లు అవుతుందా? కాదా? అనేది నిర్ధారించే భారం లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌దే. ఆ బిల్లు ద్రవ్య బిల్లేనని స్పీకర్ నిర్ధారిస్తే దీనిపై రాజ్యసభలో ఓటింగ్ జరగదు. ఇందుకు భిన్నంగా స్పీకర్ నిర్ణయించే పక్షంలో సవరణ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరుగుతుంది. ఈ బిల్లు స్వభావంపై తనకు అనుమానాలు ఉన్నందున లోక్‌సభ స్పీకర్‌కు పంపుతున్నట్టు రాజ్యసభ ఉపాధ్యక్షుడు పిజి కురియన్ స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం రాజ్యసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల అభ్యంతరాలు, అభిప్రాయాలు విన్న తరువాత కురియన్ ఈ మేరకు రూలింగ్ ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చి గొడవ చేశారు. కురియన్ రూలింగ్‌తో ఏకీభవించటం లేదంటూ రామచందర్‌రావు, ఎంఏ ఖాన్, టి సుబ్బిరామిరెడ్డి, రేణుకాచౌదరి సహా పలువురు సభ్యులు సభ దద్దరిల్లేలా నినాదాలిచ్చారు. బిల్లుపై చర్చ జరిగి, ఆర్థిక మంత్రి సమాధానమిచ్చాక ఓటింగ్ జరపాల్సిన సమయంలో అధికార పక్షం దీన్ని ద్రవ్య బిల్లుగా చిత్రీకరించటం ఐదు కోట్లమంది ఆంధ్రుల హక్కును హరించడమేనంటూ బిజెపిపై విరుచుకుపడ్డారు. సవరణ బిల్లుపై ఓటింగ్ జరపాలని, ఇది ద్రవ్య బిల్లు కాదంటూ రామచందర్‌రావు గొంతు చించుకుని నినాదాలిచ్చారు. బిజెపి ప్రభుత్వం తన హక్కులను హరిస్తోంది కాబట్టి, తన ప్రయోజనాలను కాపాడాలంటూ డిప్యూటీ స్పీకర్‌కు మొర పెట్టుకున్నారు. సవరణ బిల్లుకు రాష్టప్రతి ఆమోదం తెలిపిన తరువాతే సభలో చర్చ జరిగిందని, అప్పుడులేని అభ్యంతరం ఇప్పుడెందుకని నిలదీశారు. ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ ప్రభుత్వం సాంకేతిక అంశాల సాకుతో సవరణ బిల్లును దెబ్బతీస్తోందన్నారు. విభజన జరిగి రెండేళ్లవుతున్నా ఏపీకి ప్రత్యేక హోదాపై ఎలాంటి చర్య తీసుకోలేదు కాబట్టే సవరణ బిల్లును ప్రతిపాదించాల్సి వచ్చిందని అన్నారు. ప్రత్యేక హోదా హామీని అమలు చేస్తారా? లేదా? అన్నదే అసలు విషయమని సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి ప్రభుత్వాన్ని నిలదీశారు. పధ్నాల్గవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు హోదా ఇవ్వడం లేదంటూ ఆర్థిక మంత్రి జైట్లీ సభను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ సభ్యుడు జైరామ్ రమేష్ దుయ్యబట్టారు. తెదేపా సభ్యుడు సిఎం రమేష్, సీనియర్ సభ్యుడు గుజ్రాల్ సైతం ఇలాంటి వాదనే చేశారు. అందరి వాదనలు విన్న డిప్యూటీ స్పీకర్ కురియన్ రాజ్యాగంలోని 186, 8 అధికరణ ప్రకారం దీనిపై నిర్ణయం తీసుకోవాలంటూ దీన్ని లోక్‌సభ స్పీకర్‌కు నివేదించారు. కాంగ్రెస్ సభ్యులు నెమ్మదించకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.