జాతీయ వార్తలు

తడబడిన సల్వీందర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై ఉగ్రవాదులు జరిపిన దాడి విషయంలో పంజాబ్ పోలీసు సూపరింటెండెంట్ సల్వీందర్ సింగ్‌ను ఎన్‌ఐఎ అధికారులు సోమవారం దాదాపు 8గంటల పాటు ప్రశ్నించారు. ఇంటరాగేషన్‌లో ఆయన పొంతనలేని ప్రకటనలు చేసినట్టుగా స్పష్టమవుతోంది. సైనిక దాడిలో మృతిచెందిన నలుగురు ఉగ్రవాదుల వివరాలను పూర్తిస్థాయిలో నిర్థారించుకునేందుకు ఎన్‌ఐఎ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇంటర్‌పోల్ చేత బ్లాక్ నోటీసును జారీ చేయించింది. దీనిద్వారా మరణించిన ఉగ్రవాదుల వివరాలను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాగా, సల్వీందర్ సింగ్‌ను ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7గంటల వరకూ అనేక అంశాలపై అధికారులు ప్రశ్నించారు. మంగళవారం కూడా విచారణ జరుగుతుందని, సల్వీందర్ లై డిటెక్టర్ పరీక్షపెట్టే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. అనేక కీలక ప్రశ్నలకు సల్వీందర్ సరైన సమాధానం ఇవ్వలేదని తెలిపారు.