జాతీయ వార్తలు

లోక్‌పాల్ పదవికి ప్రముఖుల పోటాపోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: అవినీతి నిర్మూలన కోసం ప్రతిపాదించిన లోక్‌పాల్ చైర్‌పర్సన్ పదవికి అనేక మంది ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఈ పదవికోసం 16 మంది దరఖాస్తు చేసుకున్నారు. ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు, ఒక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఒక యూజీసీ సభ్యుడు, సమాచార కమిషనర్లు దరఖాస్తు చేసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నదీ ప్రజలకు అందుబాటులో ఉంచాలని సమాచార కమిషనర్ సుధీర్ భార్గవ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డివోపిటి)ని ఆదేశించారు. ఆర్‌టిఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్ అభ్యర్థన మేరకు కమిషనర్ స్పందించారు.
సుప్రీం కోర్టుకు నామినేట్ అయి త్వరలో పదవీ విరమణ చేయనున్న న్యాయమూర్తులు జ్ఞాన్ సుధామిశ్రా, సికె ప్రసాద్, బల్బీర్‌చౌహాన్‌లు లోక్‌పాల్ చైర్‌పర్సన్ పదవికి ప్రయత్నిస్తున్నారు. జార్ఖండ్ హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి ఎం కర్పాగ వినాయకం కూడా దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన విద్యుత్ ట్రిబ్యునల్ అప్పిలేట్ చైర్మన్‌గా ఉన్నారు. అలాగే యుజిసి మాజీ సభ్యుడు, మాజీ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎంఎం అన్సారీ, సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు లోక్‌పాల్ చైర్‌పర్సన్ పదవికి దరఖాస్తు చేసినట్టు డివోపిటి వెల్లడించింది.
అధ్యాపకుడు అరుణ్ గణేష్ జోగ్‌డియో, సామాజిక కార్యకర్తలు చంద్ర భూషణ్ మిశ్రా, చప్పిడి వెంకటేశ్వర రావు, పాత్రికేయుడు గుల్షన్ కుమార్ బాజ్వా, న్యాయవాది వినయ్ భూషణ్ భాటియా, స్టీల్ కంపెనీ ఉద్యోగి అంజనీ కుమార్, మేఘరామ్, రిటైర్డ్ ఐఏఎస్ రామ్ స్వరాజ్, మాజీ ఐపిఎస్ కె నందబాలన్, దీపక్ కుమార్ పోటీ పడుతున్నారు. లోక్‌పాల్ వంటి కీలకమైన సంస్థలో పదవుల భర్తీలో పూర్తి పారదర్శకత పాటించాలని ఇన్ఫర్మేషన్ కమిషనర్ సుధీర్ భార్గవ ఆదేశించారు.