జాతీయ వార్తలు

మోదీ, పారికర్‌లను చంపేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, జనవరి 19:గణతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌లను చంపేస్తామంటూ ఇస్లామిక్ మిలిటెంట్ సంస్థ (ఐఎస్‌ఐఎస్) సంతకంతో ఓ బెదిరింపు లేఖ వచ్చింది. ఈ లేఖను అందుకున్న గోవా పోలీసులు దాన్ని రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లకు పంపారు. దీనిపై తపుపరి దర్యాప్తు బాధ్యతను ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ (ఎటిఎస్)కు అప్పగించారు. గత వారమే ఓ పోస్టు కార్డులో తమకు ఈ బెదిరింపు లేఖ అందిందని అప్పటి నుంచే దీని కూపీలాగే ప్రయత్నాలు చేపట్టామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. ఈ పోస్టు కార్డు చివర్లో ఐఎస్‌ఐఎస్ అని రాసి ఉందని, ఈ లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో త్వరలోనే నిగ్గుదేలుస్తామని అన్నారు.