ఆంధ్రప్రదేశ్‌

ఆర్థిక ఇబ్బందులతో తల్లీకొడుకుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుచానూరు : తిరుపతి శివారు బైరాగిపట్టెడలోని లింగేశ్వర్‌నగర్ కాలనీలో తల్లీకొడుకు ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం జరిగింది. స్థానిక లింగేశ్వర్ నగర్‌లో మునిరాజమ్మ (50), ఆమె కొడుకు పుష్కరకాంత్ (30) గత ఐదేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. పుష్కరకాంత్ తిరుపతిలో ఓ ప్రైవేటు ఫైనాన్షియల్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. తల్లికి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. కాగా గతంలో అతని చెల్లి, నాన్న అనారోగ్యంతో గతంలో చనిపోయారు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి పుష్కరకాంత్, తల్లి మునిరాజమ్మ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఆత్మహత్యకు సంబంధించిన సూసైడ్ నోట్‌ను పుష్కరకాంత్ ఇంట్లో రాసిపెట్టాడు.
ఆ నోట్‌లో తనకు ఎవ్వరూ లేరని, అందుకే తాను చనిపోతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నాడు. అంతేకాకుండా తన బ్యాంక్ అకౌంట్‌లో 16వేల రూపాయలు ఉన్నాయని, వాటిని అంత్యక్రియలకు వినియోగించాలని కోరాడు. ఉదయం ఇంటి పక్కనే ఉన్న స్థానికులు తల్లీకొడుకు మృతిచెందిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.