జాతీయ వార్తలు

హల్‌చల్ చేస్తున్న కోహ్లీ సెల్ఫీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 30: భారత యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ సెల్ఫీలు దిగడం మామూలే. అయితే, సోషల్ నెట్‌వర్క్‌లో అతను పోస్ట్ చేసిన తాజా సెల్ఫీ హల్‌చల్ చేస్తోంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సాక్షి దంపతుల కుమార్తె జీవాతో అతను సెల్ఫీ దిగి ట్వీట్ చేశాడు. ఫేస్ బుక్‌లోనూ ఉంచాడు. ఆ ఫొటోకు కొన్ని గంటల్లోనే 1.9 లక్షల లైక్స్ వచ్చాయి. ‘జీవా నా ఫోన్ తీసుకుంది. దానిని ఏ విధంగా ఉపయోగించాలో ఆమెకు బాగా తెలుసు. చిన్నపిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ వాతావరణం మారిపోతుంది. వాళ్ల అమాయకత్వం మనల్ని కట్టిపారేస్తుంది. అన్ని వ్యాపకాలను మరచిపోయి, హాయిగా వారితోనే కాలం గడిపేయాలని అనిపిస్తుంది’ అని కోహ్లీ పేర్కొన్నాడు.