శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

మళ్లీ భూ ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరికుంటపాడు, జనవరి 8: మండల కేంద్రమైన వరికుంటపాడుతో పాటు తిమ్మారెడ్డిపల్లె, గణేశ్వరపురం, తూర్పుకొండారెడ్డిపల్లె, కాకుల వారిపల్లె, రామాపురం, రామదేవులపాడులో ఆదివారం భూప్రకంపనలు వచ్చాయి. వివరాల మేరకు మధ్యాహ్నం 1.05 గంటలకు భూమి నుంచి పెద్ద శబ్దాలు, వింత శబ్దాలు రావడంతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీసారు. మూడు సెకన్‌ల పాటుభూమి కంపించింది. రామదేవులపాడులో కాస్త తీవ్రతగా ఉందని గ్రామస్తులు తెలిపారు. మధ్యాహ్నం భోజన సమయానికి భూప్రకంపనలు రావడంతో అన్నం తింటున్న కంచాలతో పాటు నీళ్ల గ్లాసులు కూడా కదిలాయని గ్రామస్తులు తెలిపారు. ఆరునెలల తర్వాత మళ్లీ భూప్రకంపనలు వస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. భూమి లోపల మట్టి సర్దుకుంటూ ఉండటంతో ఈ వింత శబ్దాలు వస్తున్నాయని అధికారులు తెలిపారు. పగలనక రాత్రినక ఈ ప్రకంపనలు వస్తుండటంతో ఏ విపత్తు పొంచి ఉందోనని గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.