శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అన్ని రంగాలలో మహిళల ముందంజ:కురుగొండ్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాపురం, ఏప్రిల్ 30: ఇంట్లో వంట పని నుంచి విమానాలు నడిపేవరకు అన్ని రంగాలలో మహిళలు ముందున్నారని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం సాక్షర భారత్ కోఆర్డినేటర్లు, పొదుపు సంఘాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలబడడానికి మహిళలకు శిక్షణ ఇచ్చి వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి బ్యాంకు ద్యారా రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించే గ్రూపులకు వడ్డిలేని రుణాలు ఇస్తామన్నారు. మహిళల్లో 100 శాతం అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిడివో పరంధామయ్య, ఇవోపిఆర్‌డి విజయకూమర్, జిల్లా సాక్షరభారత్ కోఆర్డినేటర్ సుధాకర్‌రావు, పెంచలకోన ట్రస్టు సభ్యుడు హరినాథరావు, రాపూరు ఎఎంసి చైర్మన్ మస్తాన్‌నాయుడు, సైదాపురం, గిద్దలూరు పిహెచ్‌సి కేంద్రాల అభివృద్ధి కమిటీ చైర్మన్లు కృష్టమ్మనాయుడు, శ్రీనివాసులనాయుడు పాల్గొన్నారు.