శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

శివయ్యకు ఘనంగా లక్ష కుంకుమార్చన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 17: నగరంలోని విఆర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న కార్తీకమాస లక్ష దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉమామహేశ్వర స్వామికి లక్ష కుంకుమార్చన వేదపండితులు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 108 మంది దంపతులు పాల్గొన్నారు. అనంతరం 10 గంటలకు విశేష చండీయాగం జరిగింది. ఈ కార్యక్రమానికి సత్యంజీ అధినేత జి.సత్యనారాయణ, వరలక్ష్మి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. సాయంత్రం 7 గంటలకు అష్టదళ పాదపద్మ పూజ నిర్వహించారు.
కిక్కిరిసిన మైదానం
విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని వీక్షించి పూజలందుకుంటున్న మహా శివలింగ ప్రతిమను చూసేందుకు భక్తులు విశేష సంఖ్యలో మైదానానికి వచ్చారు. 108 అడుగుల శ్రీ ఉమా పార్థివేశ్వరస్వామిని, అనంత పద్మనాభస్వామిని చూసి తరించారు. స్వామివార్లు అందుకుంటున్న విశేష పూజలను తిలకించిన భక్తులు పరవశులయ్యారు. విఆర్ కళాశాల మైదానికి వేల సంఖ్యలో వస్తున్న భక్తులను నియంత్రించేందుకు పోలీస్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.