శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కార్యకర్తలు అధైర్యపడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, నవంబర్ 19 : వైకాపా కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైసీపీనేనని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని 42వ డివిజన్ వైకాపా పోలింగ్ బూత్ కమిటీ కన్వీనర్లు, కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అమలు కావాలంటే వైసీపీ అధికారంలోకి రావాలన్నారు. ప్రతి కార్యకర్త, బూత్ కమిటీ కన్వీనర్లు తమవంతు బాధ్యతగా పనిచేసి జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసేందుకు కృషి చేయాలన్నారు. నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ నెల్లూరు నగర ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకు బుద్ధి చెప్పి వైకాపాను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఓటర్ల నమోదు విషయంలో కూడా జాగ్రత్త వహించాలన్నారు. వైకాపాకు చెందిన ఓట్లను తొలగించేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. వైకాపాను అణగతొక్కడం ఎవరి వల్ల కాదన్నారు. 2019 ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, బూత్ కమిటీ కన్వీనర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.