శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నేడు జిల్లాకు రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 20: రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ గురువారం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్నారు. ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడితో కలిసి ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొని కొత్తగా నెల్లూరు-చెన్నైల నడుమ కొత్త మెము సర్వీసును జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే నెల్లూరు దక్షిణ రైల్వేస్టేషన్‌లో పాదచారుల వంతెన ప్రారంభం, నెల్లూరు రైల్వేస్టేషన్ పునరభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. తిరుపతి రైల్వేస్టేషన్‌లో మెరుగుపరచిన ప్రయాణీకుల సౌకర్యాలు రిమోట్ ద్వారా ప్రారంభం, అక్కంపేట స్టేషన్‌లో నూతన బుకింగ్ కార్యాలయం జాతికి అంకితం చేస్తారు. కృష్ణపట్నం - ఓబులవారిపల్లి కొత్త రైలుమార్గం ప్రాజెక్ట్‌లో భాగమైన వెంకటాచలం-వెల్లికల్లు, ఓబులవారిపల్లి-చెర్లోపల్లి మధ్య కొత్త రైలు మార్గం ప్రారంభించనున్నారు. కృష్ణపట్నం-రాపూరు స్టేషన్ల మధ్య ప్యాసింజర్ రైలు సర్వీసుల ప్రకటన చేస్తారు.