శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 24: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే సర్వేపల్లి కాలవకట్ట మీద మేకల చలపతి (24), కుమారి కుటుంబం నివసిస్తుండేది. చలపతి పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. మద్యానికి బానిసైన చలపతి తను సంపాదన అంతా మద్యానికి ఖర్చు చేసేవాడు. అతని భార్య కుమారి పద్ధతి మార్చుకోమని పలుమార్లు సూచించింది. దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈనేపథ్యంలో చలపతి గత నెల 30వ తేదీ ఫూటుగా మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. మద్యం ఎందుకు తాగి వచ్చావని భార్య నిలదీయటంతో, భార్యపై కోపోద్రిక్తుడై ఆమెను బెదిరించేందుకు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. ఈ హఠాత్తు పరిణామంతో కుమారి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. మంటల వేడిమిని తట్టుకోలేక పక్కనే ఉన్న నీటి తొట్టెలో మునిగాడు. తీవ్ర గాయాలపాలైన చలపతిని స్థానికులు చికిత్స నిమిత్తం డిఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అక్కడ వైద్యుల సూచన మేరకు తిరుపతి రుయా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతు చలపతి మృతి చెందాడు. ఈ సంఘటనపై నాలుగో నగర ఎస్‌ఐ ఆలీ సాహెద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.