శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దొరవారిసత్రం, జూలై 29: 16వ నంబర్ జాతీయ రహదారిపై మండల కేంద్రం సమీపంలోని వేణుంబాక రోడ్డు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కబీర్ బాషా (26) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు తమిళనాడులోని చెంగల్‌పట్టు ప్రాంతానికి చెందిన కబీర్ బాషా మరోవ్యక్తి స్థానికులతో కలసి గూడూరుసంతలో గొర్రెలను కొనుగోలు చేశాడు. వాటిని ట్రక్కు ఆటోలో చెంగల్‌పట్టుకుని తీసుకొని వెళుతుండగా వేణుంబాక వద్దకు వచ్చేసరికి వాహనం టైరు పగిలి రోడ్డు పక్కన బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో కబీర్‌బాషాకు తీవ్ర గాయాలు కాగా, కాలేషాకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు గాయపడిన వారిని సూళ్లూరుపేటకు తరలించి చికిత్స చేయించారు. కబీర్‌బాషాను మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ మేరకు ఎస్సై మారుతీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.