శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

డెంగ్యూతో బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాయుడుపేట, ఆగస్టు 19: మండల పరిధిలోని బిరదవాడ గ్రామానికి చెందిన కుంభాల రాజరత్న (17) అనే బాలుడు శుక్రవారం డెంగ్యూ జ్వరంతో మృతి చెందాడు. బాధితుల వివరాల మేరకు గడచిన వారంరోజులుగా బాలుడు జ్వరంతో బాధ పడుతున్నాడు. మందులు, వాడినా జ్వరం తగ్గకపోవడంతో బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా ప్రథమ చికిత్స అనంతరం రక్తపరీక్షకు పంపారు. పరీక్ష కోసం రక్తాన్ని సేకరించిన మెడాల్ విభాగం గురువారం రమ్మని బాధితుడిని పంపారు. జ్వరం తక్కువగా వుండటంతో బాలుడు గురువారం ఆసుపత్రికి వెళ్లలేదు. అయతే బాలుడు శుక్రవారం ఆగని జ్వరంతో మృతి చెందాడు. ప్రస్తుత రిపోర్టులో జీరో పర్సంట్ ప్లేట్‌లెట్స్‌గా నమోదు వచ్చింది. డెంగ్యూ జ్వరం కాదని, వైరల్ జ్వరాల్లో కూడా రక్తంలో ప్లేట్‌లెట్‌లు పడిపోతాయని వైద్యులు తెలిపారు.