నిజామాబాద్

అయ్యప్ప ఆలయాభివృద్ధికి 2లక్షల నిధులు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోమకొండ, ఫిబ్రవరి 23: బీబీపేట్ మండల కేంధ్రంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప ఆలయం అభివృద్ది పనుల కోసం రెండు లక్షల నిధులు మంజూరు చేస్తానని శాసనమండలి విపక్ష నేత షబ్బీర్ అలీ తెలిపారు. శుక్రవారం ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాకప్పి మెమోంటోను అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, గతం లో ఈ ఆలయం నిర్మాణానికి మూడు లక్షల రూపాయలు మంజూ రు చేయడం జరిగిందని, ఇప్పుడు మరో రెండు లక్షల రూపాయలు మంజూరు చేస్తానని తెలిపారు. అయ్యప్పస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఎమ్మెల్సీ స్వామి వారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమానికి ముందుగా బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రేస్ నాయకుడు నర్సింలు కూతురు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆయ న ఆశీర్వదించారు. ఆయన వెంట ఆల యం ప్రతినిధులు విఠల్, నాగేశ్వర్, సర్పంచ్ లింగం, ఎంపిటీసీ భూమాగౌడ్,రమేష్,నాగరాజ్‌గౌడ్ పాల్గొన్నారు.

ఘనంగా సంత్ గాడ్గే బాబా జయంతి
గాంధారి, ఫిబ్రవరి 23: సంత్ గాడ్గే జయంతి వేడుకలను శుక్రవారం మండల కేంద్రంలో మండల రజకసంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ సంత్ గాడ్గే బాబ బాటలో నడవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రజకసంఘం అధ్యక్షుడు మిరిదొడ్డి రాజయ్య, మండల అధ్యక్షుడు భాస్కర్, గాంధారి సర్పంచ్ సత్యం, కోఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, ఎస్‌ఐ సత్యనారాయణ, ఎంపిటీసీ రాంకిషన్‌రావు, ఉపాధ్యక్షుడు నాగ్లూర్ సాయిలు, జువ్వాడి సర్పంచ్ సంగయ్య, సంజీవులు, మోహన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంగని బాలయ్య, నాయకులు తూర్పు రాజులు, గడ శంకర్, లైని రమేష్, అల్త్ఫా, రెడ్డి రాజు, మల్లేష్ యాదవ్, వెంకట్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.