నిజామాబాద్

సంక్షేమ పథకాల వల్లే టీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, సెప్టెంబర్ 17: ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్లే టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారని మాజీవిప్ గంప గోవర్దన్ అన్నారు. సోమవారం తన నివాసంలో వివిద పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. కామారెడ్డి నియోజకవర్గం గల భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి, అంతంపల్లి, భగిర్తిపల్లి, కాచాపూర్, తలమడ్ల గ్రామాలకు చెందిన మాజీ ఎంపీటీసీ జగదీశ్వర్, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు ఎర్రం రాంబాబు, పెద్దమల్లారెడ్డి ఎంపీటీసీ హన్మంత్‌రెడ్డి, సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు ప్రశాంత్, మాజీ ఉప సర్పంచ్ చారి, ఆయాగ్రామాలకుచెందని సుమారు 300 మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు తమ పార్టీలకు రాజీనామా చేసి టీ ఆర్‌ఎస్ పార్టీలోమాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంపగోవర్థన్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈసందర్భంగా విప్ వారికి టీ ఆర్ ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధాహారణంగా ఆహ్వానించారు. అనంతరం అపద్దర్మ ముఖ్యమంత్రి కేసిఆర్, మాజీ విప్ గంపగోవర్దన్ ఫోటోలు గల కండువాలను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల టీఆర్‌ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.