నిజామాబాద్

సొంతింటి కల నిజం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్ రూరల్, నవంబర్ 14: కాంగ్రేస్ పార్టీ అధికారంలోనికి వస్తే పేదవారు సొంతింటి కలను నిజం చేస్తామని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని బెల్లాల్, అమ్దాపూర్, ఊట్‌పల్లి, రాజీవ్‌నగర్ తండాలలో ఆయన ప్రచారం చేశారు. వివిధ పార్టీల నుండి దాదాపు వంద మంది యువకులు కాంగ్రేస్‌లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో తెరాస ఏ గ్రామంలో కూడా నిరుపేదలకు సొంతింటిని ఇవ్వలేక పోయిందని విమర్శించారు. తాము అధికారంలోనికి వస్తే ఇళ్ల నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయల రుణాన్ని మంజూరు చేస్తామన్నారు. అలాగే పేదవారి అభివృద్ధి కోసం అనేక పథకాలు తీసుకొస్తామన్నారు. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సర్కారు డ్వాక్రా మహిళలను పూర్తిగా మోసం చేసిందని విమర్శించారు. అలాగే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తూ కొత్తగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌లు జారీ చేస్తామని పేర్కొన్నారు. బోధన్ నిజాంచక్కెర కర్మాగారాన్ని పూర్తిగా మూసివేసి కార్మికులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోనికి వస్తే నిజాంసుగర్స్‌ను పునరుద్ధరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎంపిపి గంగాశంకర్, జిల్లా కాంగ్రేస్ ప్రధాన కార్యదర్శి అల్లె రమేష్, మండల పార్టీ అద్యక్షుడు నాగేశ్వర్‌రావ్, శంకర్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, సంజీవ్‌కుమార్, వీరభద్రరావ్, శీల శంకర్, నీలకంఠ్, రవిదాస్ నాయక్, సంజీవ్‌కుమార్, సురేందర్‌గౌడ్, సురేందర్ పాల్గొన్నారు.