నిజామాబాద్
క్రమేపీ పెరుగుతున్న నీటిమట్టం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 5 July 2016
బాల్కొండ, జూలై 5: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన బాల్కొండ మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. రిజర్వాయర్ ఎగువ జిల్లాలైన నిజామాబాద్, ఆదిలాబాద్, నాందేడ్ జిల్లాల్లో కురిసిన వర్షం కారణంగా ప్రాజెక్టులోకి 1500 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని, దీంతో మంగళవారం సాయంత్రానికి రిజర్వాయర్ నీటిమట్టం 1048.20 అడుగులు 5.25 టిఎంసిల వద్దకు చేరుకుందని ఎఇ మహేందర్ తెలిపారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు 90 టిఎంసిలు కాగా, గత సంవత్సరం ఇదే రోజున రిజర్వాయర్ నీటిమట్టం 1057.80 అడుగులు 11.34 టిఎంసిల వద్ద నీరు నిల్వ ఉన్నట్లు ఎఇ తెలిపారు. రానున్న ఒకటి రెండు రోజుల్లో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.