నిజామాబాద్

సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక్‌నగర్, నవంబర్ 4: నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది సమస్యలపై కమిషనర్ కార్తికేయ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. శుక్రవారం ఉదయం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పరేడ్‌కు హాజరైన సిబ్బందిని ఆయన కలుసుకుని వారితో పోలీస్ దర్బార్ నిర్వహించారు. ఒక్కొక్కరిని పిలిపించుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అయితే విధులను అంకితభావంతో నిర్వర్తిస్తూ ప్రజల్లో పోలీసింగ్ వ్యవస్థ పట్ల మరింత నమ్మకాన్ని పెంపొందించాలని సిబ్బందికి సూచించారు. కాగా, పోలీసు అమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా పుస్తక్ టోలీ పరేడ్‌ను సమర్ధవంతంగా నిర్వర్తించిన 13మంది మహిళా పోలీసు కానిస్టేబుళ్లకు ఈ సందర్భంగా ప్రశంసాపత్రాలతో పాటు క్యాష్ రివార్డులను అందజేశారు. కమిషనర్ వెంట ఎసిపిలు అన్వర్‌హుస్సేన్, ఆనంద్‌కుమార్, ఆర్‌ఐ మల్లికార్జున్ ఉన్నారు.