జాతీయ వార్తలు

ఫ్లయ్‌ఓవర్ ఘటనలో బాధ్యుల అరెస్టుకు రంగం సిద్ధం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత: కోల్‌కత నగరంలో ఫ్లయ్‌ఓవర్ కుప్పకూలిన ఘటనలో నిర్మాణ సంస్థ ప్రతినిధులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌కు చెందిన ఐవిఆర్‌ఎల్‌సి సంస్థ ఈ ఫ్లయ్‌ఓవర్ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ నిర్మాణం ఆకస్మికంగా కూలిపోవడంతో 25 మరణించగా, సుమారు వందమంది గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంఘటన స్థలాన్ని సందర్శించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ముగ్గురు అధికారులున్న పోలీసు బృందం హైదరాబాద్ చేరుకుని నిర్మాణ సంస్థ ప్రతినిధులను కలిసి వివరాలు సేకరిస్తున్నారు. ఆ సంస్థ ప్రతినిధులను అరెస్టు చేసే అవకాశం ఉంది.