Others

బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రతాపగిరి రామమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(నేడు గ్రంథావిష్కరణ సందర్భంగా...)
*
మహాత్మాగాంధీ పిలుపునందుకొని 1920లో వేలాదిమంది విద్యార్థులు తమ కళాశాల విద్యకు స్వస్తి చెప్పారు. అలాంటి వారిలో కడప జిల్లా నందలూరుకు చెందిన ప్రతాపగిరి రామమూర్తి ఒకరు. కడప జిల్లా నందలూరులో 1900 జనవరిలో వీరు జన్మించారు. వీరి తండ్రి గోపాలకృష్ణయ్య ప్రముఖ న్యాయవాది. జాతీయ భావాలు కలవాడు. ఇంటిల్లిపాది ఖద్దరు దుస్తులు ధరించేవారు. వీరి కుమార్తె దేశసేవిక వేదాంతం కమలాదేవి భర్త కాకినాడ నివాసి కావడంతో తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెసు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొని పలుమార్లు జైలుకెళ్లింది. అక్కగారి ప్రభావంతో రామమూర్తి కాంగ్రెసులో చురుకుగా పనిచేశారు. రాష్ట్ర కాంగ్రెసు ఆదేశానుసారం పిల్లుట్ల హనుమంతరావుతో కలసి కడప జిల్లాలో తీవ్రంగా కాంగ్రెసు ప్రచారం చేసి కల్లుసారాయి దుకాణాలు మూతపడేటట్లు, గ్రామోద్యోగులు రాజీనామా చేసేటట్లు చేశారు. 1916లో వివాహమయిన శాంతాబాయి చిన్న వయసులోనే రామమూర్తిగారితో పాటు ఉద్యమంలో పాల్గొంటూ వచ్చింది. 1920లో రామమూర్తిని శిక్షించగా ఏడాదిపాటు వేలూరు, కడలూరు జైళ్లలో గడిపారు. వేలూరిలో ఉన్నవ లక్ష్మీనారాయణ రాస్తున్న ‘మాలపల్లి’ నవలకు రామమూర్తిగారే శుద్ధ ప్రతి తయారు చేశారు. కడలూరు జైలులో రాజాజీ వీరి సహచర ఖైదీగా వుండేవారు. 1921లో తిలక్ స్వరాజ్య నిధికి గాంధీజీ విరాళాలకు విజ్ఞప్తి చేయగా రామమూర్తి భార్య శాంతాబాయి తన ఒంటిమీద నగలు మంగళసూత్రంతో సహా మహాత్మునికి సమర్పించింది. తిరిగి 1933లో హరిజన్ నిధికి గాంధీజీ రాజమండ్రి రాగా మరొకసారి శాంతాబాయి తన ఒంటిమీది మిగిలివున్న ఆభరణాలను మహాత్మునికి అర్పించింది. ప్రతాపగిరి రామమూర్తి బొంబాయి చేరి ఒక సంవత్సరం జౌళి మిల్లులో పనిచేసి డబ్బు సమకూర్చుకొని మరుసటి సంవత్సరం విల్సన్ కాలేజీలో చదివి బీఏ, ఎం.ఏ డిగ్రీలు సంపాదించేడు. విల్సన్ కాలేజీలోనే అధ్యాపకులుగా చేరిన రామమూర్తి మేధస్సును గుర్తించిన బొంబాయి విశ్వవిద్యాలయం ‘డాక్టరేట్’ లేకపోయినా ఆచార్యునిగా నియమించింది. ఆయన రాసిన దళ ఔ్యఇళౄఒ యచి నిశజూజ్ఘ ఔ్యజఆజషఒ గొప్పగొప్ప పండితులు ప్రమాణ గ్రంథంగా స్వీకరించారు. రామమూర్తి, ఆయన శిష్యులు రచించిన పరిశోధనా గ్రంథాలయిన ‘‘గోల్కొండ చరిత్ర’’ గాంధీజీ దృక్పథంలాంటి గ్రంథాలకు మార్గనిర్దేశనం చేశారు. బొంబాయి విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర విభాగాన్ని ప్రారంభించిన ఖ్యాతి వీరిదే. బొంబాయి ఆంధ్రమహాసభ స్థాపకులలో వీరొకరు. కమ్యూనిస్టు నేత డాంగే, రణదివే, సోషలిస్టు నేత అశోక్‌మెహతాలు రామమూర్తికి సన్నిహితులు. 1952-54లో ఒంగోలులో శర్మ కాలేజీకి తొలి ప్రిన్స్‌పాల్‌గా విచ్చేసిన రామమూర్తి కాలేజీని సుస్థిరపరిచారు. 1954లో ఆంధ్ర యూనివర్శిటీ ఆహ్వానం మేరకు ‘రీడరు’గా పనిచేస్తూ 1955 అక్టోబర్ 7న అకాల మరణం పాలయినారు. ఆయన సతీమణి శాంతాబాయి వీరిని అనుసరించి జాతీయోద్యమంలో పాలుపంచుకున్నారు. 1923 కాంగ్రెసు మహాసభలలో 1926లో మహిళా సభలోను వీరు వేదాంతం కమలాదేవిగారి వెన్నంటి నిలిచారు. 1941లో అనంతపురం జిల్లా మడకసిరలో సత్యాగ్రహం చేయగా 3 నెలల శిక్ష విధించి వేలూరికి పంపారు. జైలులో అనారోగ్యంపాలైన శాంతాబాయి 1947 జనవరి 10న బొంబాయిలో ఒక ఆస్పత్రిలో క్యాన్సరుతో మరణించారు. ప్రతాపగిరి రామమూర్తి, శాంతాబాయి దంపతులు జీవితకాలం దేశసేవలో గడిపిన ధన్య జీవనులు.

-రావినూతల శ్రీరాములు.. 8885653924