Others

గుడి ప్రగతికి కొత్త ఒరవడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను గొప్ప ఆధ్యాత్మికవేత్త, ధార్మిక వీరుడు, ధర్మ నిబద్ధత గల నేత అని ఒకప్పుడు పొగిడినవారే ఆ తర్వాత- ఆలయాలు ధూప దీప నైవేద్యాలకి నోచుకోక మూతపడిపోయాయని, గొర్రెలు-బర్రెలు ఇచ్చే ప్రభుత్వం గోవులను ఎందుకు రక్షించడం లేదని పనికట్టుకుని విమర్శించడం హాస్యాస్పదం. అలా విమర్శిస్తున్న ఓ మహానుభావుడు నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ రవీంద్రభారతిలో పాలకుర్తి నృసింహరామశర్మ సత్కార కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్ ధార్మిక ప్రస్థానాన్ని కొనియాడారు. దరిమిలా తనకు హైద్రాబాద్‌లో ఆశ్రమం నిర్మాణానికి భూమి కావాలని కూడా కోరినట్లు వార్తలొచ్చాయి. అప్పుడెందుకు అలా ఎందుకు పొగిడారో, ఇప్పుడెందుకు విమర్శిస్తున్నారో ఆయనకే అర్థం కావాలి.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ఆధ్యాత్మికతకు పెద్ద పీట వేస్తూ, ప్రజల ఉజ్వల భవితను ఆకాంక్షిస్తూ సొంత ఖర్చుతో అయుత చండీయాగాన్ని అత్యంత నిష్టాగరిష్టలతో నిర్వహించిన ఘనత కేసీఆర్‌దే. ఆ తర్వాత చండీయాగం ఫలితాలు ప్రస్ఫుటంగా కనిపించాయి. యాగంలో భాగంగా అ నేకమంది పీఠాధిపతులను, బ్రాహ్మణులను, హైందవమత పెద్దలను సత్కరించి, వారి ఆశీస్సులను అందుకున్న ముఖ్యమంత్రి ఆధ్యాత్మికత పట్ల తన నిబద్ధతను ప్రదర్శించారు. బ్రాహ్మణుల, అర్చకుల, దేవాలయాల అభివృద్దికి, సంక్షేమానికి అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా అమలు చేస్తోంది. భద్రాద్రి, యాదాద్రి, వేములవాడ, కొమరెల్లి మల్లన్న లాంటి దేవాలయాలను అభివృద్ధి దిశగా తీసుకుపోవడం జరుగుతున్నది. పేదల అభ్యున్నతికి పాటుపడుతున్నట్లే బ్రాహ్మణుల సంక్షేమానికి తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బ్రాహ్మణ సంక్షేమ భవన నిర్మాణానికి 6 ఎకరాల స్థలాన్నిచ్చి, నిర్మాణానికి రూ.10 కోట్లను కేటాయించింది. హైదరాబాద్ సమీపంలోని గోపన్నపల్లిలో బ్రాహ్మణ సదన్‌కు సీఎం భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. బ్రాహ్మణ యువత నైపుణ్య అభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పెళ్లిళ్లకు కళ్యాణ మండపం, శుభకార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక హాలును నిర్మించనున్నారు. బ్రాహ్మణ పరిషత్ కు 2016-17, 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలలో వార్షిక పద్దుకింద రూ.100 కోట్ల చొప్పున కేటాయించింది.
తెలంగాణలోని అన్ని ప్రముఖ దేవస్థానాలను అభివృద్ది చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. భద్రాద్రి ఆలయాన్ని దేశంలోనే అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించి, ఖర్చుకు వెనుకాడకుండా అభివృద్ది కార్యక్రమాలను చేపట్టింది. పరమహంస పరివ్రాజకులు, శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామీజీ సూచనల ప్రకారం ఆలయ శిల్పి ఆనందసాయి బృందం రూ పొందించిన దేవాలయ అభివృద్ధి నమూనాల ఆధారంగా సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో దే వాలయాన్ని అభివృద్ధిచేయాలని నిర్ణయంచారు. గర్భగుడి, చారిత్రాత్మక, పౌరాణిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యంగల కట్టడాలకు ఆటంకం కలుగకుండా నిర్మాణాలను చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. 2018-19 బడ్జెట్‌లో భద్రాద్రి దేవస్థానానికి రూ.100 కోట్లు కేటాయించారు. కొమురవెల్లి దేవస్థానానికి 166 ఎకరాలను కేటాయించి, ఆలయ అభివృద్ధి పనులకు రూ.10 కోట్లు మంజూరు చేసారు.
సుందర పుణ్యక్షేత్రంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని తీర్చిదిద్దేందుకు ఏటా బడ్జెట్‌లో 100 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా కేటాయిస్తూ సమగ్ర ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దటానికి సంకల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. 2018-19 బడ్జెట్లో యాదాద్రి టెంపుల్ అథారిటీకి ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించింది. 13 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం పనులను చేపట్టింది. ప్రధాన దేవాలయం, గోపురాలు, ప్రాకారాలు, ప్రసాదం కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్, శివాలయం, క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణం, రథ మండపం, మెట్ల మార్గం తదితర పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి మొక్కులు సమర్పించారు. అలాగే, తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకుని, మొక్కులు తీర్చుకుని, ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు ఆభరణాలను స్వామివారికి సమర్పించారు. తిరుపతి పద్మావతి అమ్మవారికి విలువైన ముక్కు పుడకను సమర్పించారు. కురవి వీరభద్ర స్వామి దేవాలయానికి 75 వేల రూపాయల విలువైన 25 గ్రాముల బంగారు కోర మీసాలను సమర్పించారు. వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయ అభివృద్దికి రూ.51 కోట్లు విడుదల చేశారు. 2017-18 బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించారు. 2018-19 బడ్జెట్లో వేములవాడ డెవలప్ మెంట్ అథారిటీకి రూ.100 కోట్లు కేటాయించారు.
‘‘్ధపదీప నైవేద్యం’’ పథకం కింద గతంలో నెలకు రూ.2500 అందజేస్తుండగా దానిని 6 వేల రూపాయలకు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. 1,805 ఆలయాలు ఈ పథకం పరిధిలో ఉన్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి నెల రూ.1.08 కోట్లు వెచ్చిస్తున్నది. మరో 3 వేల ఆలయాలకు నెలకు 6 వేల చొప్పున ఇవ్వనున్నారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం 4805 దేవాలయాలకు ధూపదీప నైవేద్యం పథకం వర్తిస్తుంది. అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు వేతన వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్ర దేవాదాయశాఖ నిర్వహణలోని 646 దేవాలయాలలో పనిచేస్తున్న అర్చకులకు, ఉద్యోగులకు ఒకటవ తారీకునే జీతాలు ఇస్తున్నారు. నేరుగా వారి బాంక్ ఖాతాలలో వేతనాలు జమ అయ్యేవిదంగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అర్చకుడికి కనీస వేతనం రూ.25 వేలు లభిస్తున్నది. జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగికి రూ.25 వేలు జీతభత్యాలుగా లభిస్తున్నాయి.అన్యాక్రాంతమైన ఆలయ భూముల వివరాలు సేకరించింది. ఇందుకోసం ఒక ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం నియమించింది.
కామన్ గుడ్‌ఫండ్ (సిజిఎఫ్) కింద నిధులను దేవాలయాల మరమ్మతులకు వినియోగించడం జరుగుతుంది. ప్రస్తుతం సిజిఎఫ్ నిధుల ద్వారా 1361 దేవాలయాల్లో పునరుద్దరణ పనులు గుర్తించగా అందుకు రూ.254.78 కోట్లు కేటాయించగా ఆ మొత్తం నుండి రూ.46.58 కోట్లు విడుదల చేశారు. డబ్య్లు.ఎస్.హెచ్.సి. పనుల నిమిత్తం 720 దేవాలయాలను గుర్తించగా వాటికి గాను 48.22 కోట్లు మంజూరు చేయగా అందులో రూ.6.90 కోట్లు విడుదల చేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గానూ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద సిజిఎఫ్ లో రూ.50 కోట్లు మంజూరు చేయగా అందులో రూ.7.50 కోట్లు చెల్లించారు. ప్రభుత్వ అజమాయషీని తగ్గించి, ఇకపై దేవాలయాల నిర్వహణ, తదితర వ్యవహారాలన్నీ పర్యవేక్షించడానికి కొత్తగా ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసే ఆలోచనలో వుంది ప్రభుత్వం. ఈ పరిషత్ ఆధ్వర్యంలోనే ఇకపై దేవాలయాల నిర్వహణ ఉంటుంది. ఇక, ఉన్నత పదవులలో నియమితులైన బ్రాహ్మణ అధికారులు రాష్ట్ర అభివృద్దిలో తమవంతు కృషిని అందిస్తున్నారు. పదవీ విరమణ చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను తెలంగాణ రాష్ట్ర ప్రధాన సలహాదారుగా, మీడియా సలహాదారుగా-తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడిగా విశ్రాంత ఐఎఎస్ అధికారి కె.వి.రమణాచారిని, పోలీసు వ్యవహారాల సలహాదారుడిగా మాజీ డీజీపీ అనురాగ్ శర్మను, ఇలా పలువురిని సీఎం ఉన్నత పదవుల్లో నియమించారు. అన్ని స్థాయిలలో బ్రాహ్మణుల సేవలను వినియోగించుకుంటూ, అర్చకులను ఆదుకుంటూ, దేవాలయాలను అభివృద్దిపరుస్తూ, ఆధ్యాత్మిక వికసించేలా నూతన ఒరవడికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు.

చిత్రం: యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు

-వనం జ్వాలా నరసింహారావు సెల్: 80081 37012