Others

ఎవరేమంటే నాకేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీ ట్రెండ్.....

ఎవరేమంటే నాకేంటి?
క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో హీరోయిన్ ఛార్మి-పూరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. ఆ సినిమాలో ఆమెను సహ నిర్మాతగా మార్చేశాడు పూరి. ఇక అక్కడి నుండి పూరితో కలిసి ఛార్మి ప్రతి సినిమాకు పనిచేస్తోంది. పైగా ఇద్దరూ కలిసి పూరి కనెక్ట్ అంటూ ఓ ఈవెంట్ కంపెనీని ఏర్పాటుచేశారు. పూరితోనే ఛార్మి ఉంటుంది కాబ ట్టి వీరిద్దరి గురించి పలు రూమర్స్ తెగ పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం పూరి బ్యానర్‌లో నిర్మాతగా వ్యవహారాలు చూసుకుంటున్న ఛార్మి ఈ విషయంపై తాజాగా స్పందించింది. జనాలు ఎవరేమనుకున్నా తాను, పూరి మంచి స్నేహితులమని చెప్పింది. తాను, పూరి కూడా ఫేమస్ కాబట్టి జనాలు మా గురించి ఏవేవో మాట్లాడుకుంటారు. అదే నేను అబ్బాయిగా ఉంటే ఇలా అనుకోరు కదా! నేను ఒక హీరోయిన్ కాకపోయినా ఇలాంటి వార్తలు రావు. ఇప్పుడు నేనేం చెప్పినా ఎవరు పట్టించుకోరు. అందుకే వివరణ ఇవ్వడం మానేశాను. ఎవరేమి అనుకున్నా సరే నా జీవితం నేనే బతకాలి. వాళ్లు అలా అంటున్నారు.. వీళ్లు ఇలా అనుకుంటున్నారని అన్ని పనులు ఆపేసి కూర్చోలేను కదా. ఇతరుల జీవితాల గురించి ఆరాలు తీయడం ఆపేసి మీ జీవితాన్ని బాగుచేసుకునే పనిలో పడండి. నా లైఫ్ గురించి నాకు నచ్చిందే చేస్తానంటూ కాస్త గట్టిగానే చెప్పేసింది అందాల ఛార్మి.

తనయుడితో మరోసారి..!
ప్రస్తుతం వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలనే దిశగా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలో తన తనయుడు ఆకాష్ పూరితో మెహబూబా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం మేలో విడుదలకు సిద్ధమైంది. మెహబూబా కోసం పూరి చాలా కష్టపడ్డాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన రావడంతో కొత్త ఉత్సాహంతో మరో సినిమాకు సిద్ధమవుతున్నాడు పూరి. అయితే ఈసారి కూడా ఆయన తన తనయుడు ఆకాష్‌తోనే మరో సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఇప్పటికే దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలిసింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు ప్రకటించే అవకాశం వుంది.

అట్లీ తర్వాతి సినిమా?
రాజారాణి, తెరి, మెర్సల్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న తమిళ దర్శకుడు అట్లీ. ఈ మూడు సినిమాలూ తెలుగులోనూ విడుదలై, మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే అట్లీ త్వరలో ఓ తెలుగు సినిమా తెరకెక్కించనున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అట్లీ తాజాగా ఓ కళాశాల విద్యార్థులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తన తర్వాతి ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. ‘ఓ ప్రముఖ హీరోతో తెలుగులో భారీ సినిమా తీయబోతున్నా. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. పూర్తి వివరాలకోసం మరికొన్ని రోజులు ఎదురుచూడండి’ అని అట్లీ పేర్కొన్నారు. అయితే అట్లీ తన సినిమాలో హీరోగా ప్రభాస్ లేదా అల్లు అర్జున్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. దాదాపు బన్నీ నటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘తెరి, ‘మెర్సల్’ తర్వాత అట్లీ- విజయ్ కాంబినేషన్‌లో మూడో సినిమా రాబోతోందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే విజయ్ ప్రస్తుతం ఎ.ఆర్.మురుగదాస్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంవల్ల అట్లీతో ప్రాజెక్టుకు డేట్స్ కుదరలేదట.

-- శ్రీనివాస్ ఆర్.రావ్