Others

మల్టీస్టారర్ కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘మహానటి’గా సంచలన విజయాన్ని అందుకొని మంచి మార్కులు కొట్టేసింది ‘మహానటి’ అలియాస్ కీర్తి సురేష్. సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించి అందరితో నీరాజనాలు అందుకుంటున్న కీర్తి ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమెతో సినిమాలు చేసేందుకు పలువురు దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. తాజాగా ఆమెకు ఓ క్రేజీ మల్టీస్టారర్‌లో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కినట్లు వార్తలొస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. ‘బాహుబలి’ తరువాత సంచలన దర్శకుడు రాజవౌళి తెరకెక్కించే చరణ్-ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్ కోసం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ల అనే్వషణ కూడా సాగుతోందట. ఈ నేపథ్యంలో ‘మహానటి’ చిత్రంలో కీర్తి బాగా నటించిందని అభినందనలు అందించిన రాజవౌళి, ఆమెను తన సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని ఆలోచనలో ఉన్నాడని, ప్రస్తుతం ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రం జూలైలో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుందా.. లేదా? అనేది తెలియాలంటే ఇంకొన్నిరోజులు వేచి చూడాల్సిందే.