AADIVAVRAM - Others

హైపర్‌లూప్....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వామ్మో! గంటకు 457 కిలోమీటర్లా..? అని గుడ్లు తేలేస్తున్నారా? ఆగండాగండీ.. గంటకు 1,123 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అత్యాధునిక రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి వర్జిన్ హైపర్‌లూప్ వన్ పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్న అత్యంత వేగవంతమైన మెట్రో రైలు రవాణా వ్యవస్థను పోలిన ‘హైపర్‌లూప్’కు సంబంధించి ఇప్పటికే ఒక రికార్డు నమోదైంది.
హైపర్‌లూప్ వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడే ప్రయత్నాలను ప్రోత్సహించేందుకు స్పేస్ ఎక్స్ ఏరోస్పేస్ సంస్థ ఒక పోటీని నిర్వహించింది. ఇందులో జర్మనీ విద్యార్థుల బృందం విజయం సాధించింది. ‘వార్ హైపర్‌లూప్’ అనే ఈ బృందం రూపొందించిన హైపర్‌లూప్ పాడ్‌ను 1.2 కిలోమీటర్ల పొడవైన ప్రయోగ ట్రాక్‌పై నడిపి చూడగా, ఇది గంటకు 457 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. ‘టెక్నికల్ యూనివర్శిటీ ఆఫ్ మ్యూనిక్’కు చెందిన ఈ బృందానికి ఇది మూడో విజయం. అయస్కాంతాల సాయంతో పట్టాలపై రైలును పైకెత్తి నిలపడం వల్ల రాపిడి తగ్గి వేగం పెరిగే మాగ్లెవ్ (మాగ్నెటిక్ లేవిటేషన్) రైళ్లు ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నడుస్తున్నాయి. వీటిలో ఒకటి చైనాలోని షాంఘై నుంచి అక్కడి విమానాశ్రయానికి ప్రయాణికులను గంటకు 430 కిలోమీటర్ల వేగంతో తీసుకెళ్తోంది. ఈ మాగ్లెవ్‌ను వాక్యూమ్ ట్యూబ్ (శూన్య గొట్టంలో) నడపడం ఇంకా అత్యాధునికమైన ప్రక్రియ. ఇదే హైపర్‌లూప్ వ్యవస్థ. ఈ వ్యవస్థలో ప్రత్యేక సొరంగం ఒక భాగం. వాహనం ప్రయాణించేటప్పుడు గాలి కారణంగా ఎదురయ్యే నిరోధాన్ని, రాపిడిని తగ్గించేందుకు ఈ సొరంగంలో గాలి లేకుండా చేస్తారు.
జర్మనీ బృందంతో పోటీపడిన నెదర్లాండ్స్‌లోని డెల్ట్స్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ బృందం గంటలకు 141.6 కిలోమీటర్ల వేగాన్ని, స్విట్జర్లాండ్‌కు చెందిన ‘ఈపీఎఫ్‌లూప్’ 88.5 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే అందుకోగలిగాయి. ఈ పోటీని స్పేస్ ఎ క్స్ వ్యవస్థాపకుడు,

టెస్లా సంస్థ సహ వ్యవస్థాపకుడు అయిన ఎలాన్ మస్క్ తిలకించారు. ఆ హైపర్‌లూప్ పాడ్‌ల ప్రయాణాలను కూడా ఎలాన్ పరిశీలించాడు.
భారతదేశంలో..
మనదేశంలో ముంబై బెంగళూరు చెన్నై నగరాల మధ్య 1,102 కిలోమీటర్ల హైపర్‌లూప్ మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ప్రకారం ముంబై నుంచి చెన్నైకి 63 నిముషాల్లో చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి 334 కిలోమీటర్ల దూరంలోని చెన్నైకి 23 నిముషాల్లో చేరుకోవచ్చు. ముంబై పుణె మధ్య కూడా ఈ వ్యవస్థను నిర్మించాలనే ఆలోచనలో ఉన్న వర్జిన్ హైపర్‌లూప్ వన్ సంస్థ పుణె మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోనూ ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం, హైపర్‌లూప్ అమెరికాకు చెందిన హైపర్‌లూప్ ట్రాన్స్‌పోర్టేషన్ టెక్నాలజీస్ (హెచ్‌టీటీ) మధ్య గత సంవత్సరం సెప్టెంబర్‌లో అవగాహన ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే.
*