AADIVAVRAM - Others

స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజాన్ని సక్రమమార్గంలో నడపాలంటే ఎవరో మహానుభావులు జన్మించాల్సిందే. సమాజంలో సమానత్వం సాధించేందుకు, అంటరానితనాన్ని రూపుమాపేందుకు, దేవాలయాల్లో అందరికీ ప్రవేశం కల్పించేందుకు వేయి సంవత్సరాల క్రితమే ‘విప్లవం’ సృష్టించిన మహానుభావుడు భగవత్ రామానుజాచార్యులు. అట్టడుగు వర్గాలు ఆలయాల్లోకి వచ్చేందుకు వీలులేని వాతావరణం కొనసాగుతున్న సమయంలో, అంటరానితనం అడుగడుగునా కనిపిస్తున్న సమయంలో రామానుజులు జన్మించారు. సమాజంలో అంతా సమానమేనని, భగవంతుడి ముందు కులాల ప్రసక్తిలేదని ఎలుగెత్తి చాటినవారాయన. ఇప్పటికి సరిగ్గా వెయ్యి సంవత్సరాల క్రితం అంటే 1017 లో జన్మించిన రామానుజులు 120 సంవత్సరాల పాటు జీవించి, తన జీవితాన్ని యావత్తూ సమసమాజ స్థాపనకే ఉపయోగించారు. రామానుజుల మించిన మానవతామూర్తి లేరని బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అభిప్రాయపడ్డారంటే రామానుజుల వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థమవుతుంది. వేయి సంవత్సరాల తర్వాత రామానుజుల వారిని తలచుకోవడం, స్మరించుకోవడం మన ధర్మం.
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ఒక అడుగు ముందుకు వేసి భగవత్ రామానుజుల గురించి భావి తరాల వారికి తెలియచేసేందుకు, ప్రపంచంలో గుర్తింపు తీసుకువచ్చేందుకు భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఆయన సంకల్ప ఫలితంగా రామానుజుల వారి భారీ విగ్రహం రూపొందింది. ఈ విగ్రహాన్ని హైదరాబాద్ సమీపంలోని శ్రీరామనగరంలో ఏర్పాటు చేశారు. రామానుజుల విగ్రహంతో పాటు ఈ విగ్రహం చుట్టూ 108 దివ్య దేశాలకు చెందిన ఆలయాల నమూనాలతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ నిర్మాణాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణాలు పూర్తయ్యేందుకు మరో ఏడెనిమిది నెలల సమయం అవసరం అవుతుందని భావిస్తున్నారు. సమాజంలో సమానత్వం సాధించేందుకు రామానుజులు పాటుపడినందువల్ల ఈ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ ఇక్వాలిటీ’ అని చిన జీయర్ పేరు పెట్టారు. 216 అడుగుల ఎత్తుతో దీన్ని ఏర్పాటు చేశారు. కూర్చుని ఉన్న భంగిమలో ఏర్పాటు చేసిన ఎతె్తైన విగ్రహాల్లో ఈ విగ్రహం ప్రపంచంలో రెండో అతి పెద్దదిగా పేరు తెచ్చుకోబోతోంది. విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పటికీ, చుట్టూ కట్టడాల నిర్మాణం పూర్తి కాలేదు. లాంఛనంగా ప్రారంభించలేదు. 40 ఎకరాల స్థలంలో ఏర్పాటవుతున్న స్టాచ్యూ ఆఫ్ ఇక్వాలిటీ ప్రాజెక్టులో మొదటి దశ నిర్మాణాన్ని 2019 ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. నిర్ణీత సమయానికి అనుకున్నట్టుగానే పూర్తయితే దీన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేత ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. త్రిదండి చిన శ్రీమన్నారాయణ రామానుజు జీయర్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లి ప్రధానికి ఆహ్వాన లేఖ అందించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పరిధిలోకి వచ్చే ముచ్చింతల్ గ్రామ సమీపంలోని శ్రీరామనగరంలో రామానుజుల విగ్రహం ఏర్పాటు పూర్తయితే ఇది దేశానికే మణికిరీటంగా మెరవనుంది. భారత దేశంలో ఇంత ఎతె్తైన విగ్రహం కూర్చుని ఉన్న భంగిమలో ఇప్పటి వరకు లేకపోవడం గమనార్హం. గుజరాత్‌లో సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ విగ్రహాన్ని ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో 597 అడుగుల ఎత్తులో నిలుచుని ఉన్న భంగిమలో ఏర్పాటు చేస్తున్నారు. కూర్చుని ఉన్న భంగిమలో ఏర్పాటవుతున్న భగవత్ రామానుజుల పంచలోహ విగ్రహం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక రికార్డు నెలకొల్పబోతోంది. థాయిలాండ్‌లో ఏర్పాటు చేసిన గౌతమబుద్ధ కూర్చుని ఉన్న విగ్రహం 302 అడుగుల ఎత్తుతో అతి పెద్ద విగ్రహంగా పేరుతెచ్చుకుంది. వాస్తవంగా శ్రీరామనగరంలో భగవత్ రామానుజాచార్యు ల విగ్రహాన్ని 302 అడుగుల కంటే మరింత ఎత్తుగా ఏర్పాటు చేయాలని త్రిదండి చినజీయర్ భావించారు. అయితే ఈ విగ్రహం ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలానికి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉండటంతో, 300 పైగా అడుగుల ఎతె్తైన రామానుజుల విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతించలేదు. దాంతో విగ్రహం ఎత్తు 216 అడుగులకే పరిమితం చేయాల్సి వచ్చింది.
చైనాలోని ఏరోసన్ కార్పొరేషన్ ఈ విగ్రహాన్ని వేర్వేరు భాగాలుగా తయారు చేసి, ఇక్కడకు తీసుకువచ్చి అమర్చారు. కమలం పువ్వు ఆకృతి రూపొందించి, ఈ పువ్వు మధ్యభాగంలో విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం అడుగుభాగంలో మూడంతస్తుల భవనం నిర్మాణమయింది. దీనికి ‘్భద్రవేది’ అని పేరుపెట్టారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో రామానుజాచార్యుల వారి జీవిత చరిత్రకు సంబంధించిన ఫోటోలు తదితరాలు ఉంటాయి. మొదటి అంతస్తులో 120 కిలోల బంగారంతో తయారు చేస్తున్న రామానుజుల మరో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రామానుజులు 120 సంవత్సరాలపాటు జీవించి ఉండటం వల్ల 120 కిలోల బంగారాన్ని ఉపయోగించి విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. రామానుజుల బంగారు విగ్రహానికి నిత్య పూజలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండో అంతస్తులో వేదిక్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటవుతోంది. రామనుజుల విగ్రహం చుట్టూ 108 దివ్యదేశాల మాడల్ ఆలయాలు నిర్మాణం అవుతున్నాయి. విగ్రహం ముందుభాగంలో 108 మెట్లు నిర్మించారు
స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనావేశారు. ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 500 కోట్ల రూపాయల వరకు ఖర్చయింది. దీని నిర్మాణంలో అందరినీ భాగస్వాములను చేసేందుకు చిన జీయర్ ప్రయత్నిస్తున్నారు. శ్రీరామ నగరానికే కాకుండా తెలంగాణ రాష్ట్రానికే వనె్న తెచ్చే ప్రాజెక్టుగా ఇది రూపొందుతోంది. దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించే కేంద్రంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు.
రామానుజుల గురించి..
సమాజంలో అట్టడుగు వర్గాల వారికి అందరితో పాటు సమానహోదా కల్పించేందుకు పాటుపడ్డ రామానుజులు 1017 సంవత్సరంలో జన్మించారు. 120 సంవత్సరాలు జీవించారు. మొట్టమొదటి ఆచార్యులుగా పేరుతెచ్చుకున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కూడా రామానుజల వారిని ఆచార్యులుగా ఆమోదించి, రామానుజుల నుండి శంఖుచక్రాలను స్వీకరించారు. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులను అందరికీ అర్థమయ్యే విధంగా కామెంటరీలు రాశారు. గత వెయ్యి సంవత్సరాల కాలంలో వచ్చిన భక్తిప్రచారాలకు రామానుజులు ఆదర్శంగా నిలిచారు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన మహానుభావులు. అలాంటి రామానుజాచార్యుల వారికి సముచిత గౌరవం ఇచ్చేందుకు చిన్న జీయర్ ‘రామానుజ సహస్రాబ్ది’ పేరుతో కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. శ్రీరామనగరంలో ఇటీవలే అంతర్జాతీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేశారు.